తబ్లిగి జమాత్‌కు 53మంది మేడ్చల్‌ వాసులు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందిన 53 మంది దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌కు హాజరైనట్లు మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆనంద్‌ తెలిపారు. సమావేశాలకు..

Published : 01 Apr 2020 16:03 IST

మల్కాజిగిరి: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందిన 53 మంది దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌కు హాజరైనట్లు మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆనంద్‌ తెలిపారు. సమావేశాలకు హాజరైనట్లు గుర్తించి ఈ 53 మందిని ఐసోలేషన్‌కు తరలించినట్లు చెప్పారు. నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌కు హాజరైన వారు ఇంకా ఎవరైనా జిల్లాలో ఉన్నట్లయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని