డబ్బుల్లేక గుహలో నివాసం ఉన్నారు
ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్రం రిషికేశ్ సందర్శనకు వచ్చారు ఆ ఆరుగురు విదేశీయులు. రెండు నెలలు అక్కడే గడిపారు. అంతలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి.
రిషికేశ్లో ఆరుగురు విదేశీయుల గుర్తింపు
రిషికేశ్: ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్రం రిషికేశ్ సందర్శనకు వచ్చారు ఆ ఆరుగురు విదేశీయులు. రెండు నెలలు అక్కడే గడిపారు. అంతలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. అసలే కొత్త ప్రాంతం.. మరోవైపు తెచ్చుకున్న డబ్బులూ అయిపోయాయి. ఏం చేయాలో పాలుపోక చివరకు వారు ఓ గుహలోకి వెళ్లిపోయారు. మార్చి 24వ తేదీ నుంచి అక్కడే కాలం వెళ్లదీస్తున్న వారిని స్థానికుల సాయంతో ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు.. శనివారం సాయంత్రం క్వారంటైన్కు తరలించారు.
గంగానది నుంచి నీళ్లు..
ఈ బృందంలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మొత్తం ఆరుగురిలో ఉక్రెయిన్ నుంచి ఇద్దరు, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, నేపాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ‘హోటల్లో ఉండేందుకు డబ్బులు లేక వారు తమ సామగ్రితోసహా గుహలోకి చేరిపోయారు. వంటచెరకుతో వంట చేసుకున్నారు. గంగానదిలోనుంచి నీళ్లను తెచ్చుకున్నారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్కు తరలించాం. వైద్య పరీక్షల్లో ఎవరిలోనూ కరోనా లక్షణాలు బయటపడలేదు’ అని వివరించారు. మరోవైపు నేటికి దాదాపు 600-700 వరకు విదేశీయులు రిషికేశ్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారి వారి దేశాల చొరవతో క్రమక్రమంగా స్వదేశాలకు తరలుతున్నారని పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు