ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

నగర జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్రం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్‌ రాష్ట్రవ్యాప్తంగా...

Updated : 25 Apr 2020 09:26 IST

 న్యూయార్క్‌లో కేసుల తీరు..
 నమూనా ‘యాంటీబాడీ పరీక్షల’ ఆధారంగా గుర్తింపు

న్యూయార్క్‌(అమెరికా) నగర జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్రం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్‌ రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ మార్కెట్లు, బిగ్‌ బాక్స్‌ స్టోర్ల బయట నిర్వహించిన 3 వేల యాంటీబాడీ పరీక్షల ఆధారంగా ఈ లెక్క కట్టారు. ‘‘న్యూయార్క్‌ నగరంలో 21% మంది (దాదాపుగా 20 లక్షల మంది)లో, రాష్ట్రవ్యాప్తంగా 13.9% మందిలో వైరస్‌ యాంటీబాడీలు ఉన్నాయి. అంటే 3 నుంచి 6 వారాల క్రితమే వారు వైరస్‌ బారిన పడి కోలుకున్నారు’’ అని రాష్ట్ర గవర్నర్‌ కుమోవ్‌ గురువారం వెల్లడించారు. ఈ లెక్కలను మొత్తం జనాభాతో పోల్చలేమని, పూర్తిస్థాయిలో బాధితుల సంఖ్యని ఈ అధ్యయనం వెల్లడించలేదని చెప్పారు. ‘‘వీరంతా షాపింగ్‌కు వచ్చినవారు. ఇళ్లలో ఉన్నవారు, క్వారంటైన్‌లో, ఐసోలేషన్‌లో ఉన్నవారు, వైద్యులు, ఆరోగ్య సేవకులు, విధుల్లో ఉన్నవారు ఈ సర్వేలో భాగం కాలేదు’’ అని కుమోవ్‌ పేర్కొన్నారు.బాధితుల్లో తెల్లవారి కంటే నల్ల జాతీయులు, లాటిన్‌ అమెరికన్లు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని