చైనా వస్తువైతే తనిఖీ తప్పనిసరి: మంత్రి
ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్రల ఐటీ మంత్రులకు సూచించారు.....
ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించాలి
రాష్ట్రాల ఐటీ మంత్రులకు రవిశంకర్ ప్రసాద్ సూచన
దిల్లీ: ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్రాల ఐటీ మంత్రులకు సూచించారు. ఇంటి నుంచి పనిచేసేందుకు కనెక్టివిటీ నిబంధనలను సులభతరం చేశామన్నారు. ఏప్రిల్ 30తో ముగుస్తున్న గడువును జులై 31 వరకు పొడగిస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకొనేలా అవగాహన కల్పించినందుకు రాష్ట్రాలను రవిశంకర్ ప్రసాద్ అభినందించారు. ఇక నుంచి తయారయ్యే ఫీచర్ ఫోన్లలోనూ ఇలాంటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. రెచ్చగొట్టేలా ఉన్న సమాచారాన్ని తొలగిస్తున్నామని ఆ సంస్థలు తెలియజేశాయని వివరించారు. ఏవైనా సంస్థలు నకిలీ వార్తలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏ దేశం నుంచైనా వస్తువులను దిగుమతి చేసుకుంటే కఠినంగా తనిఖీలు, భద్రతా ఆడిట్ చేపట్టాలని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చైనా వస్తువులైతే మరింత జాగ్రత్తగా చేయాలి. ‘ఒక విషయం స్పష్టం. మనం ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. భారత్కు అనుకూలం. దేశ ప్రజల కోసం అవకాశాలు సృష్టించాలి. భద్రత విషయానికి వస్తే ఏ వస్తువైనా ఇతర దేశాల నుంచి వస్తే ప్రత్యేకించి చైనా అయితే భద్రతా ఆడిట్, తనిఖీ తప్పనిసరి’ అని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM