పరీక్షలు చేశాకే కూలీలు, కార్మికుల తరలింపు
వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో
ఏపీ కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు
అమరావతి: వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపుతామని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజల వివరాలను ఆయా రాష్ట్రాల సీఎస్లకు పంపించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ప్రభుత్వానికి రిపోర్టు చేశారని కృష్ణబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో సుమారు 64,300 మంది కూలీలు ఉన్నారని.. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 వేల మంది పొగాకు పనుల కోసం వచ్చారని చెప్పారు. గుజరాత్ నుంచి బయలుదేరిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు రేపు మధ్యాహ్నానికి రాష్ట్రానికి చేరుకుంటారని వెల్లడించారు. ఏపీకి చెందినవారు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్లయితే వారు కంట్రోల్ రూం నంబర్ 0866-2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు వివరించారు.
రాష్ట్రంలోని గ్రీన్జోన్లలో కార్యకలాపాలు పెంచుతున్నట్లు కృష్ణబాబు చెప్పారు. గ్రీన్జోన్లలో 40 శాతం సిబ్బందితో పని చేసేందుకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రీన్ జోన్లలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సడలింపులు ఇచ్చామన్నారు. గుంటూరు గ్రీన్ జోన్ నుంచి కర్నూలు గ్రీన్జోన్కు తొలి బృందాన్ని పంపినట్లు కృష్ణబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు