
Published : 01 May 2020 10:09 IST
కొవిడ్ వ్యాక్సిన్ డిజైన్ బృందంలో కడప శాస్త్రవేత్త
నందలూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందంలో కడప జిల్లా నందలూరు మండలం కోనాపురానికి చెందిన శాస్త్రవేత్త ఉప్పలపాటి లక్ష్మీనరసయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధకుడు జోనాథన్ గెర్షోని నేతృత్వంలోని బృందం ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ డిజైన్ను రూపొందించింది. దీనికి మార్చి నెలలో అమెరికా పేటెంట్ కూడా ఇచ్చింది. గెర్షోని బృందంలోనే లక్ష్మీనరసయ్య ఉన్నారు. సాధారణంగా వైరస్ నిరోధక వ్యాక్సిన్ తయారీకి రెండేళ్లు పడుతుందని, తమ బృందం దీన్ని రెండు నెలల్లోనే సాధించిందని టెల్అవీవ్ నుంచి లక్ష్మీనరసయ్య ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Tags :