పాలు ఇలా కూడా పోస్తారా..!
కరోనా వైరస్ విజృంభణతో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సరకులు, పాలు, కూరగాయల విక్రయాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి......
వ్యాపారి వినూత్న ఆలోచన.. ఫొటో వైరల్
న్యూదిల్లీ: కరోనా వైరస్ విజృంభణతో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యావసర సరకులు, పాలు, కూరగాయల విక్రయాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పాల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పాలు పోసే సమయంలో కూడా భౌతికదూరం పాటించేలా ఉపాయం ఆలోచించాడు. ఓ పైపునకు గరాట జోడించి పాల క్యాన్లతోపాటు బైక్కు దాన్ని అమర్చుకున్నాడు. మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి ద్విచక్రవాహనంపై కూర్చొనే పాలు పోస్తున్నాడు. భౌతిక దూరం పాటించేందుకు ఇది ఓ చక్కటి ఉపాయమని అతడి వద్ద పాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఏఎస్ అధికారి నితిన్ సంగ్వాన్ ట్విటర్లో ఈ ఫొటో పోస్ట్ చేశారు. పాల వ్యాపారి ఆలోచనను మెచ్చుకున్నారు. ‘కొందరు వ్యక్తులు తమను, తమ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచడానికి వినూత్నంగా ఆలోచించడం సంతోషంగా ఉంది. ఇళ్లలో ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉందాం. ఈ పాల వ్యాపారిలా బయటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా.. మాస్కు ధరించి, కనీస భౌతిక దూరం పాటిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘సృజనాత్మకత, పాల వ్యాపారికి కుడోస్, ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్న ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్, ఇది నిజంగా గొప్ప ఆలోచన, ప్రజల్లో అవగాహన ఏర్పడటం ఆనందంగా ఉంది..’ అని రకరకాల పోస్ట్లు చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి