ఇంటి వద్దకే మద్యం సరఫరా!
ఇంటి వద్దకే మద్యం సరఫరా లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం ఆంక్షలు పటిష్ఠంగా అమలయ్యేందుకు తమ సలహాను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది....
రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలన్న సుప్రీం కోర్టు
దిల్లీ: ఇంటి వద్దకే మద్యం సరఫరా లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం ఆంక్షలు పటిష్ఠంగా అమలయ్యేందుకు తమ సలహాను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
కరోనా వైరస్ లాక్డౌన్లో మద్యం అమ్మకాలకు అనుమతినివ్వడం సాధారణ పౌరుడి జీవితంపై ప్రభావం చూపిస్తోందని దాఖలైన పిల్ను న్యాయమూర్తులు అశోక్ భూషణ్, సంజయ్ కిషన్కౌల్, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.
‘మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయం. భౌతిక దూరం పాటించేందుకు ఇంటి వద్దకే మద్యం సరఫరా లేదా పరోక్ష అమ్మకాలను రాష్ట్రాలు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఇంటి వద్దకే మద్యం సరఫరాపై చర్చలు కొనసాగుతున్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు?’ అని న్యాయమూర్తి ఎస్కే కౌల్ ప్రశ్నించారు.
పరిమిత సంఖ్యలోనే మద్యం దుకాణాలు తెరవడంతో భౌతిక దూరం అమలు కష్టమవుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది దీపక్ సాయి అన్నారు. ‘మద్యం అమ్మకాల వల్ల సామాన్యుడి జీవితంపై ప్రభావం పడొద్దు. విక్రయాలపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు స్పష్టతనివ్వాలి’ అని కోరారు.
మద్యాన్ని ఇంటికి వద్దకే సరఫరా చేసే అంశాన్ని జొమాటో పరిశీలిస్తోందని ఇంతకుముందే కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా అందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధన భారత్లో లేదని తెలిసింది. నిబంధనల మార్పు కోసం కొందరు లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్