నాసా చెప్పినా..ఇవాంక వినలేదు

2011 తరవాత అమెరికాలో స్పేస్‌ఎక్స్ నిర్వహించ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రకు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాంక ట్రంప్ హాజరయ్యారు.

Published : 29 May 2020 03:26 IST

 వైరస్ మీ దరిచేరదా? అంటూ నెటిజన్ల విమర్శలు

వాషింగ్టన్: 2011 తరవాత అమెరికాలో స్పేస్‌ఎక్స్ నిర్వహించ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా అధ్యక్షుని కుమార్తె  ఇవాంక ట్రంప్ హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇంటి నుంచి వీక్షించమని ప్రజలందరికి సూచించినప్పటికీ ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ మిషన్‌ను వీక్షించడానికి ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌కు వెళ్లారు. వారి పర్యటనకు సంబంధించిన చిత్రాలను ఆమె భర్త జేర్డ్ కుష్నర్ ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో ఆయన కనీసం మాస్క్‌ కూడా ధరించలేదు. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వారి కుటుంబానికి కరోనా వైరస్‌ను తట్టుకొనే రోగ నిరోధక శక్తి ఉందా? అని ప్రశ్నించారు. దీని ద్వారా వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మరో నెటిజన్ కామెంట్‌ చేశారు. కరోనా వైరస్‌ సృష్టించిన విలయతాండవానికి ఇప్పటివరకు ఎక్కువ బలైంది అమెరికా దేశ వాసులే. ఆ దేశంలో మరణాల సంఖ్య లక్షమార్కును కూడా దాటేసింది. 

ఇదిలా ఉండగా,  వాతావరణం అనుకూలించకపోవడంతో లాంచింగ్‌కు 17 నిమిషాల ముందు అంతరిక్ష యాత్రను వాయిదా వేశారు. మే 30, మే 31.. ఈ రెండు తేదీలలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మిషన్ ప్రయోగం వాయిదా పడటంతో  ఇవాంక ట్విటర్ వేదికగా నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. అయితే అన్నింటికంటే భద్రతే ముఖ్యమని అన్నారు.   

ఇవీ చదవండి:

సోషల్ మీడియా సంస్థలకు ట్రంప్‌ హెచ్చరిక!

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని