5 నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే ప్రమాదం
జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి బస్డిపో వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్ను బ్రీజా కారు ఢీకొనడంతో ఓ...
జీడిమెట్ల డిపో వద్ద కంటైనర్ను ఢీకొన్న కారు
ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
షాపూర్నగర్, న్యూస్టుడే: జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి బస్డిపో వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్ను బ్రీజా కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 200 కి.మీ. ప్రయాణించిన వీరు 5 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. సుభాష్నగర్ నివాసి శివాల వీర్శెట్టికి జహీరాబాద్ సమీపంలోని మర్పల్లి వద్ద వ్యవసాయక్షేత్రం, స్టీల్ గోదాములు ఉన్నాయి. మూడు రోజుల క్రితం గాలివానకు గోదాము ప్రహరీ కూలిపోయింది. దాన్ని పునర్నిర్మించేందుకు ఆదివారం తన బ్రీజా కారులో కుత్బుల్లాపూర్ నివాసి నార్లకంటి ప్రతాప్, షాపూర్నగర్ నివాసి సింగర్తి యాదగిరి (45)తో కలిసి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణమైన వీరు పటాన్చెరువు వద్ద ఔటర్ రింగ్రోడ్డు ఎక్కి దుండిగల్లో నర్సాపూర్ రోడ్డుపైకి వచ్చారు. రాత్రి 12 గంటలకు సూరారం మీదుగా షాపూర్నగర్ వైపు వస్తుండగా జీడిమెట్ల డిపో సమీపంలో ఓ భారీ కంటైనర్ యూటర్న్ చేసుకోవడం గమనించకుండా ఢీకొట్టారు.దీంతో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయింది. కారును ప్రతాప్ నడుపుతుండగా పక్కసీట్లో వీర్శెట్టి, వెనుక యాదగిరి కూర్చున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో ముందుభాగంలో కూర్చున్న వారు గాయాలతో బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న యాదగిరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు, యాదగిరి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ముగ్గురు మద్యం మత్తులో ఉన్నారని, అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు