చైనా బలగాల ప్రదర్శనపై వీడియో విడుదల
లద్దాఖ్ సమీప వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా సైనిక కమాండర్లు భేటీ అయిన మరుసటి రోజే తమ సైనిక బలగాల ప్రదర్శనపై చైనా ఓ వీడియో విడుదల చేసింది. చైనాకు చెందిన
దిల్లీ : లద్దాఖ్ సమీప వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు భేటీ అయిన మరుసటి రోజే తమ సైనిక బలగాల ప్రదర్శనపై చైనా ఓ వీడియో విడుదల చేసింది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఈ వీడియో దృశ్యాల్లో వేల మంది చైనా సైనికులు భారత్-చైనా సరిహద్దుల వద్ద ఆయుధ సామాగ్రితో మోహరించినట్లు కనిపిస్తోంది. అందులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), పీఎల్ఏ ఎయిర్ఫోర్స్ దళాలు సైనిక బలగాలు కసరత్తులు చేస్తున్నట్లు చైనా మీడియా పేర్కొంది. ‘అత్యంత ఎత్తైన భారత్-చైనా సరిహద్దు ప్రాంతానికి.. హుబెయ్ ప్రావిన్స్ నుంచి వాయవ్యానికి కొద్ది గంటల్లోనే బలగాలు చేరుకున్నాయని’ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. తూర్పు లద్దాఖ్లోని చైనా వైపు మాల్దోలో ఉన్న సరిహద్దు సిబ్బంది సమావేశ ప్రాంతంలో శనివారం ఇరుదేశాల మధ్యత భేటీ జరిగింది. భారత బృందానికి లేహ్లో ఉన్న 14 కోర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం