మంచినీళ్లనుకుని శానిటైజర్‌ తాగి వీఆర్‌ఏ మృతి

విశాఖపట్నం జిల్లాలో వీఆర్‌ఏ సారిపల్లి సత్యనారాయణ(55) మంచి నీళ్లు అనుకొని శానిటైజర్‌ తాగడంతో ప్రాణాలు కోల్పోయారు. నక్కపల్లి ఎస్సై

Updated : 08 Jun 2020 07:57 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లాలో వీఆర్‌ఏ సారిపల్లి సత్యనారాయణ(55) మంచి నీళ్లు అనుకొని శానిటైజర్‌ తాగడంతో ప్రాణాలు కోల్పోయారు. నక్కపల్లి ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. సారిపల్లిపాలేనికి చెందిన సత్యనారాయణ ఉపమాకలో వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం కార్యాలయానికి తాళాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. అక్కడ బల్లపై సీసాలో ఉన్న శానిటైజర్‌ను మంచినీరనుకుని తాగేశారు. వెంటనే ఆ విషయాన్ని గుర్తించి సర్వేయర్‌కు తెలపడంతో అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరగంట తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపేశారు. రాత్రి 8 గంటల సమయంలో సత్యనారాయణకు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు నక్కపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అనకాపల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని