ఈ బూట్లు ధరిస్తే.. సామాజిక దూరం పాటించినట్లే!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో వైరస్ను అరికట్టేందుకు మానవ ప్రయత్నంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా సామాజిక దూరం కూడా పాటిస్తున్నాం. అయితే కొందరు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. దుకాణాలు
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో వైరస్ను అరికట్టేందుకు మానవ ప్రయత్నంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా సామాజిక దూరం కూడా పాటిస్తున్నాం. అయితే కొందరు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. దుకాణాలు వద్ద కొంత మంది సామాజిక దూరం పాటించకుండా దగ్గర దగ్గరగా నిలుచుంటున్నారు. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గరే కాదు.. విదేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు రొమానియాకు చెందిన ఓ వ్యక్తి వినూత్న బూట్లు రూపొందించాడు. ఇవి వేసుకున్న వ్యక్తులు కచ్చితంగా సామాజిక దూరం పాటించేస్తారు.
గ్రిగొర్ లుప్ ఓ చెప్పుల వ్యాపారి. లాక్డౌన్కు ముందు వరకు థియేటర్ ఆర్టిస్టులు, జానపద కళాకారులు తదితరులు ఆయన వద్దకు వచ్చి పెద్ద ఎత్తున చెప్పులు, బూట్లు ఆర్డిరిచ్చేవాళ్లు. దీంతో ఆయన వ్యాపారం బ్రహ్మండంగా సాగేది. అయితే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో ఆయన దుకాణం మూతపడింది. వ్యాపారమూ నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉంటూ కేవలం నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారట. అయితే లాక్డౌన్ నిబంధన ప్రకారం నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలి. కానీ అక్కడి ప్రజలు ఆ నిబంధనను పాటించకపోవడం లుప్కి ఆందోళన కలిగించింది. దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని భావించిన లుప్ తన వృత్తి నైపుణ్యానికి పని చెప్పాడు. యూరప్ బూట్ల కనీసం సైజు 40 (24సె.మీ) కాగా.. వాటి సైజును 75 (46 సె.మీ)కి పెంచాడు. అంటే బూటు మొదలు భాగాన్ని పొడిగించాడు. దాని వల్ల ఆటోమేటిక్గా ఇద్దరు వ్యక్తలు మధ్య దూరం పెరుగుతుంది. తాజాగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ బూట్లు వైరల్గా మారాయి. ఈ ఒక జత బూట్లు తయారు చేసేందుకు లుప్కి రెండ్రోజులు పడుతోందట. ఇప్పటికే లుప్కి ఈ పొడవాటి బూట్లు కావాలని ఐదు ఆర్డర్లు వచ్చాయి. వీటి ధర 115 డాలర్లు (సుమారు రూ. 9 వేలు)అని లుప్ చెప్పుకొచ్చాడు.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్ కోరారు. ‘రత్నం’ ప్రెస్మీట్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?