INPICS: వీరుడికి కన్నీటి వందనం
లద్దాఖ్లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్-చైనా సరిహద్దు వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఉద్రిక్తతలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, సైనికుడు కర్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
సూర్యాపేట: లద్దాఖ్లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్-చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, కర్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వేలాది మంది ప్రజలు కర్నల్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్థానికులు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సైనిక సంస్కారాల ప్రక్రియలు 16 బిహార్ రెజిమెట్ బృందం పాల్గొంది.
సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి
కర్నల్ పార్థివదేహం వద్ద కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎంపీలు బండి సంజయ్, అర్వింద్
వందనం చేస్తున్న సైనికులు
వందనం చేస్తున్న కుటుంబ సభ్యులు
కర్నల్ సంతోష్బాబు అంతిమ యాత్ర
కర్నల్ సంతోష్బాబు అంతిమ యాత్ర
జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం తెలుపుతున్న స్థానికులు
అంతిమయాత్ర
అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన స్థానికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి