24 గంటల్లో కరోనా ఫలితాలు తారుమారు

ఓ మహిళకు 24 గంటల వ్యవధిలో ఒకసారి కరోనా పాజిటివ్‌, మరోసారి నెగెటివ్‌......

Published : 24 Jun 2020 07:13 IST

 ఒకసారి పాజిటివ్‌, మరోసారి నెగెటివ్‌

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఓ మహిళకు 24 గంటల వ్యవధిలో ఒకసారి కరోనా పాజిటివ్‌, మరోసారి నెగెటివ్‌ రావడం చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళ (65)కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా ఈనెల 21న పాజిటివ్‌గా తేలింది. వెంటనే వైద్యాధికారులు, పంచాయతీ పాలకవర్గం సదరు గ్రామంలో కంటెయిన్‌మెంట్‌ జోన్‌ను ప్రకటించారు. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ రావడంతో అనుమానంతో మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే 22న నెగిటివ్‌ అని తేలింది. దీనిపై అధికారిక సమాచారం రాలేదని మండల వైద్యాధికారిణి డా.రోహిణి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని