పోలీసు విచారణకు పీవీపీ గైర్హాజరు
తమ వద్ద నమోదైన ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్కు చెందిన వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) హాజరు కాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా...
హైదరాబాద్ : తమ వద్ద నమోదైన ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్కు చెందిన వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) హాజరు కాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందిని ఫిలింనగర్లోని నివాసం వద్ద ఉంచారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో నిర్మించిన విల్లాల్లోని ఒకదాన్ని ఏడాదిన్నర క్రితం పీవీపీ.. విక్రమ్ కైలాశ్కు విక్రయించారు. ఇంటి పైభాగంలో కైలాశ్ నిర్మాణాలు చేపడుతుండగా పీవీపీతోపాటు 15 మంది అనుచరులు అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పీవీపీని బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని రాత్రి 10.30 గంటల వరకు విచారించారు. మరుసటి రోజు కూడా విచారణకు రావాలని నోటీసు జారీ చేసినా ఆయన వెళ్లలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..