హైకోర్టులో పీవీపీకి ఊరట
వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విల్లా గొడవకు సంబంధించి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో పీవీపీపై
హైదరాబాద్: వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విల్లా గొడవకు సంబంధించి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పీవీపీ బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈకేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్