ప్రైవేటుకు అప్పజెప్పేలా విద్యుత్ బిల్లు: జగదీశ్ రెడ్డి
భద్రాద్రి పవర్ప్లాంట్ రెండో యూనిట్కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు....
హైదరాబాద్: భద్రాద్రి పవర్ప్లాంట్ రెండో యూనిట్కు 270 మెగావాట్లు అనుసంధానించామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు. రెండో ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. కొందరు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఆలస్యమైందని పేర్కొన్నారు. మరో నెలన్నరలో మూడో యూనిట్ను ఆరంభిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రిలో పూర్తి స్థాయిలో 1080 మె.వా విద్యుత్ ఉత్పత్తిని త్వరలోనే ఆరంభిస్తామని మంత్రి అన్నారు.
‘విద్యుత్ బిల్లుపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రానికీ ప్రజలకూ ఉపయోపడే విధంగా బిల్లు లేదని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రధానికి లేఖరాశారు. రాయితీలు పొందే వారికి, రైతాంగానికి బిల్లుతో తీవ్ర నష్టం వస్తుంది. చిన్న చిన్న వినియోగదారులు సబ్సిడీలను కోల్పోతారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది’ అని జగదీశ్ రెడ్డి అన్నారు.
‘రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుంది. రాష్ట్రాల హక్కులను ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా బిల్లు ఉంది. సమాఖ్య ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధంగా కేంద్రం తీరు లేదు. కొవిడ్ వల్ల డిస్కమ్లు ఇబ్బందులు పడుతున్నాయి. డిస్కమ్లకు 9.5% వడ్డీతో అప్పు ఇస్తామన్నారు. 8.5% ఇస్తే బాగుంటుందని మేం సూచించాం. విద్యుత్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, పశ్చిమ బంగ, పంజాబ్ మన అభిప్రాయాలతో ఏకీభవించాయి. మార్పులు చేస్తామని కేంద్రం చెప్పింది కానీ చేతల్లో కనిపించలేదు. సవరించిన ముసాయిదా మాకు అందలేదు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం’ అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?