నిషేధానికి ముందే చైనా యాప్లకు దెబ్బ
భారత్లో నిషేధానికి ముందే చైనా యాప్ల వాడకం తగ్గిందని నీల్సన్ మీడియా సర్వే తెలిపింది. గల్వాన్ లోయలో డ్రాగన్తో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచే తగ్గుదల చోటుచేసుకుందని వెల్లడించింది...
గల్వాన్ ఘటనతో వాడకం తగ్గించిన భారతీయులు
ముంబయి: భారత్లో నిషేధానికి ముందే చైనా యాప్ల వాడకం తగ్గిందని నీల్సన్ మీడియా సర్వే తెలిపింది. గల్వాన్ లోయలో డ్రాగన్తో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచే తగ్గుదల చోటుచేసుకుందని వెల్లడించింది.
లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయలో జూన్ 15న చైనా, భారత సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చైనాపై ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. దుందుడుకు డ్రాగన్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత, దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతోందని 59 చైనీస్ యాప్లను జూన్29న నిషేధించింది. కాగా గల్వాన్ ఘటన నుంచే యాప్ల వినియోగం తగ్గిందని నీల్సన్ మార్కెట్ సర్వే తెలిపింది.
మొబైల్ ఫోన్లలో ఈ యాప్లను సందర్శించే వారి సంఖ్య జూన్ 20తో ముగిసిన వారానికి 5% తగ్గి 77 శాతానికి చేరుకుందని సర్వే తెలిపింది. ఆ తర్వాత 76%కు చేరుకుందని వెల్లడించింది. టైర్-1 నగరాల్లో 15-24 ఏళ్ల యువత యాప్ల వాడాకాన్ని బాగా తగ్గించింది. ఈ రెండు సెగ్మెంట్లలో 11% తగ్గుదల నమోదైంది. యాప్లను సందర్శించే సగటు సెషన్ల సంఖ్య 10% తగ్గింది. జూన్ 20తో ముగిసిన వారానికి ఇది 7.4 ఉండగా జూన్ 27తో ముగిసిన వారానికి 5.4కు తగ్గిపోయింది. 15-24 ఏళ్ల వయసున్న పురుషుల సైతం యాప్లు చూడటం బాగా తగ్గించారు. ఈ సెగ్మెంట్లో 18% వరకు తగ్గుదల నమోదైంది. టైర్-2 నగరాల్లోనైతే ఏకంగా 20 శాతం తగ్గింది.
ప్రభుత్వం అధికారికంగా నిషేధించడానికి ముందే వివిధ సంస్థలు చేసిన ప్రచారం యాప్ల వాడకంపై ప్రభావం చూపిందని నీల్సన్ తెలిపింది. ఇక జులై 3తో ముగిసిన వారానికి టీవీ వీక్షణ 1.017 ట్రిలియన్ నిమిషాలుగా ఉందని బార్క్ తెలిపింది. కొవిడ్-19కు ముందున్న నాటితో పోలిస్తే 887 బిలియన్ నిమిషాలు ఎక్కువని తెలిపింది. అయితే లాక్డౌన్లో సాధించిన 1.266 ట్రిలియన్ నిమిషాల కన్నా తక్కువే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!