కృత్రిమ మేధ.. సాగించింది హవా
కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఆసుపత్రుల్లో రోగుల పరీక్షలు మొదలు వైరస్ను నివారించే రసాయనాలను చల్లడం వరకు....
2020లో భారీగా పెరిగిన రోబోలు, డ్రోన్ల వినియోగం
ఇంటర్నెట్ డెస్క్: మానవాళి రూపొందించిన అద్భుత ఆవిష్కరణ కృత్రిమ మేధ. వివిధ రంగాల్లో మానవుల ప్రమేయం లేకుండా కావాల్సిన పనిని చేసిపెట్టే రోబోలు, డ్రోన్ల సేవలను మనం చాలా కాలం నుంచే పొందుతున్నాం. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఆసుపత్రుల్లో రోగుల పరీక్షలు మొదలు వైరస్ను నివారించే రసాయనాలను చల్లడం వరకు.. విద్యార్థులకు పట్టాల ప్రదానం నుంచి దుకాణాల నిర్వహణ వరకు ఈ ఏడాది వివిధ దేశాల్లో రోబోలు, డ్రోన్లు విశేష సేవలందించాయి. సామాజిక దూరం పాటించడం, వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు అనేక దేశాల్లో డ్రోన్లు, రోబోల వినియోగం పెరిగిపోయింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అక్కడికి రాకుండానే రోబోల సాయంతో వీడియో కాల్ ద్వారా 170 మందికి పట్టాలు అందించారు. కొవిడ్పై అప్రమత్తత కల్పించేందుకు జపాన్లో ఓ రోబోను రూపొందించారు. ఎవరైనా మాస్కు ధరించకుంటే వారి దగ్గరకు వెళ్లి మాస్కు ధరించాలని ఈ రోబో సూచిస్తుంది. జపాన్లోని పలు క్వారంటైన్ కేంద్రాల్లో రోగులను పలకరించడం సహా నేలను శుభ్రం చేసేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. చైనా, నెదర్లాండ్స్లోని కొన్ని హోటళ్లలో వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకునేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. ఇజ్రాయిల్, రష్యాల్లో మానవ ప్రమేయం లేకుండా కరోనా రసాయనాలను చల్లే యంత్రాలను రూపొందించారు. లండన్లో కొన్ని రోబోలు టైలర్ అవతారమెత్తి కొలతలు కూడా తీసుకుంటున్నాయి.
కొలంబియాలో వినియోగదారులకు వస్తువులను అందించేందుకు రోబోలను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల వినియోగదారుల ఇంటి వద్దే వస్తువులను జారవిడిచే డ్రోన్లను రూపొందించారు. భారత్లోనూ ఈ ఏడాది రోబోలు, డ్రోన్ల వినియోగం బాగానే పెరిగింది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో రోగుల శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేసుకోవడం, రోగులను వార్డులకు తీసుకువెళ్లడం వంటి సేవలను అందిస్తున్నాయి.
ఇవీ చదవండి...
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!
కరోనా వేళ.. జల్లికట్టుకు అనుమతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్