Indian Railway: ప్రయోగాత్మకంగా హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ల పరుగు
ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్ ఇంధన సాంకేతికతను భారతీయ రైల్వే
బిడ్లను ఆహ్వానించిన రైల్వేశాఖ
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్ ఇంధన సాంకేతికతను భారతీయ రైల్వే కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటిదాకా జర్మనీ, పోలెండ్లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. కాలుష్య రహిత హరిత రవాణా విధానంగా దీన్ని చెప్పుకోవచ్చు. హరియాణాలోని సోనిపట్ - జింద్ మార్గంలో 89 కిలోమీటర్ల మేర ఉత్తర రైల్వే నడిపే డెమూ రైలుకు హైడ్రోజన్ ఇంధన సాంకేతికతను వినియోగించనున్నట్లు సంబంధిత మంత్రిత్వశాఖ శనివారం ఓ ప్రకటన వెలువరించింది. దీనికి సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5లోపు బిడ్లను దాఖలు చేయాల్సిందిగా ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ముందు ఆగస్టు 17న ఈ విధానంపై ఓ సదస్సు కూడా ఏర్పాటు చేసింది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న రైళ్లన్నింటిలో ఈ మార్పులు తీసుకువస్తారు. దీనివల్ల ఒక్కో రైలుకు ఏటా రూ.2.3 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావడమే కాకుండా.. కర్బన ఉద్గారాలు ఏటా 11.12 కిలో టన్నుల నుంచి 0.72 కిలో టన్నులకు తగ్గుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్