Covaxin: కొవాగ్జిన్ తయారీలో ఎదురైన సవాళ్లకు అక్షరరూపం
యావత్ ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారికి ప్రస్తుతం సమర్థంగా ముకుతాడు వేయగలుగుతున్న కొవాగ్జిన్ టీకాను ..
దిల్లీలో ‘గోయింగ్ వైరల్: మేకింగ్ ఆఫ్ కొవాగ్జిన్- ది ఇన్సైడ్ స్టోరీ’ పుస్తకావిష్కరణ
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల
దిల్లీ: యావత్ ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారికి ప్రస్తుతం సమర్థంగా ముకుతాడు వేయగలుగుతున్న కొవాగ్జిన్ టీకాను దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్తో కలిసి తాము దేశీయంగా అభివృద్ధి చేయడంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ‘గోయింగ్ వైరల్: మేకింగ్ ఆఫ్ కొవాగ్జిన్- ది ఇన్సైడ్ స్టోరీ’ పేరుతో ఆయన రాసిన పుస్తకాన్ని దిల్లీలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భార్గవతో పాటు దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్, కేంద్ర ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్న విజయ్ రాఘవన్, భారత్ బయోటెక్ ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ కృష్ణ ఎల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. కొవాగ్జిన్ తయారీ సాకారమవడంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఎంత కీలక పాత్ర పోషించిందో తెలియజేశారు. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు సంబంధించి సిసలైన విజయగాథగా తమ టీకా అభివృద్ధి ప్రక్రియను అభివర్ణించారు. పరస్పర గౌరవం, విశ్వాసం, పారదర్శకత ఆధారంగా తాము ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో 8 నెలల కంటే తక్కువ కాలంలోనే కొవాగ్జిన్ను తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతలా కష్టపడ్డారో తాజా పుస్తకంలో భార్గవ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?