దిగిరానున్న వంట నూనెల ధరలు..!
వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో దేశీయంగా వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ఒక టన్ను ముడి పామాయిల్పై 86 డాలర్లు, ఆర్బీడీ క్రూడ్ పామోలిన్ నూనెలపై 112 డాలర్ల మేర.
దిల్లీ: వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో దేశీయంగా వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ఒక టన్ను ముడి పామాయిల్పై 86 డాలర్లు, ఆర్బీడీ క్రూడ్ పామోలిన్ నూనెలపై 112 డాలర్ల మేర సుంకాన్ని తగ్గించినట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. సోయా బీన్ నూనెలపైనా 37 డాలర్ల మేర సుంకాన్ని తగ్గించినట్టు వెల్లడించింది. గురువారం నుంచే కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
సుంకం విలువ తగ్గించడం వల్ల మూల దిగుమతి ధరపై చెల్లించాల్సిన కస్టమ్స్ సుంకం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు దిగి వచ్చే సూచనలున్నట్లు వెల్లడించారు. దేశంలో వినియోగానికి తగినంతగా వంట నూనెల ఉత్పత్తి జరగడంలేదని ఏఎమ్ఆర్జీ, అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ తెలిపారు. ఈ కారణంగానే వీటి దిగుమతి ఇటీవల బాగా పెరిగిందని పేర్కొన్నారు. దీంతో కొద్ది నెలలుగా వంటనూనెల ధరలు క్రమంగా పెరిగాయన్నారు. మూల దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం రిటైల్ ధరలపై కనిపిస్తుందన్నారు. ఫలితంగా వినియోగదారులకపై భారం తగ్గుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు