Ganesh Idol: బిస్కెట్ ప్యాకెట్లతో గణపతి విగ్రహం అలంకరణ.. ఎలా ఉందంటే?
గుజరాత్కు చెందిన ఓ మహిళ ఫుడ్ ప్యాకెట్స్తో అలంకరించి ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేశారు
ఇంటర్నెట్ డెస్క్: ఏటా వినాయకచవితిని పురస్కరించుకుని విభిన్న రూపాల్లో గణేశ్ ప్రతిమలు కొలువుదీరడం మనం చూస్తూనే ఉంటాం. ఎవరికి వారు తాము ఏర్పాటు చేసిన విగ్రహం ప్రత్యేకంగా కనపడేలా తీర్చిదిద్దుతారు. లుథియానాకు చెందిన ఓ బేకరి వాళ్లు చాక్లెట్తో 200 కేజీల గణపతి విగ్రహాన్ని తయారు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. తాజాగా గుజరాత్లో ఓ మహిళ బిస్కెట్ ప్యాకెట్స్తో విగ్రహాన్ని అలంకరించి ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేశారు.
గుజరాత్కు చెందిన రాధిక సోనీ అనే మహిళ ఆహార వృథాను అరికట్టడానికి గతంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా బిస్కెట్ ప్యాకెట్లతో ఐదు అడుగుల శివలింగాన్ని తయారు చేసి మధ్యలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీని తయారీకి 1008 బిస్కెట్ ప్యాకెట్లతో పాటు 850 రుద్రాక్షలను వాడారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు పంచే రెండు సంస్థలకు చెందిన బ్యానర్లను కూడా ఉంచారు.
‘‘ఇలాంటి ప్రత్యేకమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన వ్యక్తిగత అనుభవం ద్వారానే వచ్చింది. మా ఇంట్లో నిర్వహించిన వేడుకల్లో చాలా ఆహారం వృథా అయ్యేది. ఆ తర్వాత అసలు ఆహారాన్ని వృథా చేయొద్దని నిర్ణయించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా రోజూ మూడింట ఒక వంతు ఆహారం వృథా అవుతోంది. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ 2021 ప్రకారం.. ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి 50కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారని నివేదిక చెబుతోంది. అందుకే దాన్ని అరికట్టడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విగ్రహ తయారీలో వాడిన బిస్కెట్ ప్యాకెట్లను నిమజ్జనం తర్వాత పేదలకు పంచిపెడతాం’’ అని రాధిక పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు