‘కన్యాదానం’ రిపీట్.. కోరుకున్న వాడికి భార్యనిచ్చి వివాహం చేసిన భర్త!
కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని గుర్తించిన ఓ భర్త.. ఆమె సంతోషాన్నే కోరుకున్నాడు. తన సతీమణికి రెండో పెళ్లి జరిపించాడు......
కాన్పుర్: కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని గుర్తించిన ఓ భర్త.. ఆమె ఆనందాన్నే కోరుకున్నాడు. తన సతీమణికి రెండో పెళ్లి జరిపించాడు. ‘నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో.. వారితో కలిసి ఉంటేనే నాకూ ఆనందం’ అంటూ ప్రేమిస్తున్న యువకుడికే తన భార్యను ఇచ్చి వారిద్దరినీ ఒకటి చేశాడు. భార్య పెళ్లికి పెద్దగా మారాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
కాన్పుర్కు చెందిన కోమల్, పంకజ్కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భర్తతో కోమల్ అయిష్టంగానే ఉంటోంది. దీంతో అసలు సమస్యేంటని భార్యను ఆరా తీశాడు పంకజ్. ‘నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా’నని భార్యకు మాటిచ్చాడు. దీంతో ఆమె తన ప్రేమ విషయం విషయం బయటపెట్టింది. పింటు అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. కుటుంబసభ్యులు తనకు బలవంతంగా ఈ వివాహం జరిపించారని వివరించింది. పింటుతో ఉంటేనే సుఖంగా ఉంటానని చెప్పింది.
ఇదంతా విన్న పంకజ్ ఆమెను కోపగించుకోలేదు. ప్రశాంతంగా ఆలోచించి సరేనన్నాడు. ‘నువ్వు సంతోషంగా ఉంటానంటే అదే నాకు ఆనందం’ అంటూ భార్య వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ముందుగా ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడాడు. వారిని నచ్చజెప్పాడు. సంప్రదాయబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పింటు, కోమల్కు వివాహం జరిపించారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు