ఏపీలో ఐఏఎస్ అధికారులు బదిలీ

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం

Updated : 28 Jan 2021 00:30 IST

అమరావతి: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నారాయణ్ భరత్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయం డైరెక్టర్‌గా భరత్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను నియమించింది. ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సైతం అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్‌గా జి.ఎస్.నవీన్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదీ చదవండి..

ఎస్‌ఈసీ అడ్డగోలు చర్యలను ప్రభుత్వం తిప్పికొడుతుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని