TS News: 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ .....

Updated : 20 Jan 2022 21:36 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణీప్రసాద్‌ను నియమించింది. అలాగే, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగం కార్యదర్శిగా నిర్మల, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శిగా మణిక్కరాజ్‌, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా పౌసుమి బసు, శ్రుతి ఓజా, విద్యాశాఖ ఉప కార్యదర్శిగా హరిత, ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా అనితా రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అధర్‌ సిన్హాలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని