Diwali Gift: దీపావళి బొనాంజా.. ఉద్యోగులకు గిఫ్ట్గా ఈ-స్కూటర్లు!
₹76,848 (ఎక్స్ షోరూమ్ ధర) విలువైన ఒకినావా ప్రైజ్ప్రో స్కూటర్లను దీపావళి గిఫ్ట్గా అందజేసింది. పెట్రోల్ ధరలు మండిపోతుండటం, ఇతర అంశాలను దృష్టిలో ......
సూరత్: గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కంపెనీ దీపావళి కానుకగా తమ ఉద్యోగులకు అదిరిపోయే కానుక అందించింది. ఎంబ్రాయిడరీ మిషన్ల వ్యాపారం చేసే అలియెన్స్ గ్రూపు తమ కంపెనీలో పనిచేస్తున్న 35 మంది ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను గిఫ్ట్గా అందించి తన ప్రత్యేకతను చాటుకొంది. ₹76,848 (ఎక్స్ షోరూమ్ ధర) విలువైన ఒకినావా ప్రైజ్ప్రో స్కూటర్లను దీపావళి గిఫ్ట్గా అందజేసింది. పెట్రోల్ ధరలు మండిపోతుండటం, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను దీపావళి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆ కంపెనీ డైరెక్టర్ సుభాష్ దార్వార్ తెలిపారు. ఈ అంశం మీడియాలో శీర్షికలుగా రావడమే కాకుండా కంపెనీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంధన ఖర్చులను ఆదా కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..