ఇక్కడ ముఖాన్ని అమ్ముతారట!
ఎవరైనా ఆస్తులో, అంతస్తులో అమ్ముకుంటారు. కానీ జపాన్వాళ్లకి ముఖాన్ని అమ్ముకునే అవకాశం వచ్చింది. అదెలా సాధ్యం. అయినా ముఖాన్ని అమ్ముకుంటార..........
ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా ఆస్తులో, అంతస్తులో అమ్ముకుంటారు. కానీ జపాన్వాళ్లకి ముఖాన్ని అమ్ముకునే అవకాశం వచ్చింది. అదెలా సాధ్యం. అయినా ముఖాన్ని అమ్ముకుంటారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే అసలు సంగతి తెలుసుకుందురు రండి..
జపాన్ వాళ్లు ఏది చేసినా వినూత్నంగా ఉంటుంది. టెక్నాలజీలో కూడా ముందుంటారు. ఎప్పుడూ ఏదో ఒక వింత ప్రయత్నం చేసి వార్తల్లో నిలుస్తారు. ఇప్పుడు కూడా అదే బాటలో ఈ వింత అమ్మకం మొదలు పెట్టారు. సంగతేంటంటే.. జపాన్ రాజధాని టోక్యోలో ‘కమెన్యా ఒమాటో’ అనే సంస్థ ‘ముఖాలని కొంటాం’ అంటూ ప్రకటన విడుదల చేసింది. అంటే మన ముఖాన్ని ఫొటో, వీడియో తీసుకుని అచ్చం మన ముఖంలాంటి మాస్క్లను 3డీ ప్రింట్ రూపంలో తయారుచేస్తున్నారు. మన ముఖాన్ని వాళ్లకు ఇచ్చినందుకు మనకు 40వేల యెన్లు ఇస్తారు. అంటే 26 వేల రూపాయలన్నమాట. మన ముఖాన్ని అమ్మితే 26 వేలు ఎలా ఇస్తారో అలాగే ఎవరి ముఖాన్ని అయిన కొనుక్కుంటే మన దగ్గర రూ.65 వేలు తీసుకుంటారు. అంటే వాళ్లకు డబుల్ కంటే ఇంకా ఎక్కువ లాభమొస్తుంది. ఈ ప్రాజెక్టుకు ‘దట్ ఫేస్’ అని ఆ సంస్థ పేరు పెట్టింది.
ఇంతకీ ఈ ఫేస్ మాస్క్లు తీసుకుని ఏం చేసుకుంటారు అనేగా మీ ప్రశ్న. కొంతమంది సరదాగా కొనుక్కుని ఫొటోకు ఫోజులిస్తుంటే.. మిగతావారు నేరాలు చేయడానికి చక్కటి అవకాశం అని లోలోన మురిసిపోతూ ఈ ఆఫర్కు సై అంటున్నారు. ఎందుకంటే జపాన్ వాళ్లు అందరి శరీరాకృతి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాబట్టి ఫేస్ మాస్క్ పెట్టుకుంటే ఎవరూ గుర్తు పట్టలేరు. కాబట్టి సులువుగా నేరాలు చేయొచ్చు. అయితే ఆ సంస్థ ముందే ఈ ఆలోచనని ఊహించింది, అందుకే మాస్క్ ఇచ్చేటప్పుడే ఈ మాస్క్ అమ్ముకునేవారుగానీ, కొనుక్కునేవారుగానీ చేసే చర్యలకు ఎలాంటి బాధ్యత మాకుండదు అనే ఒప్పంద పత్రాన్ని తీసుకుంటుంది. ఇక పోతే ఈ మాస్క్ ఎక్కువ సేపు ఉంచుకోవడం కుదరదు. ఎందుకంటే కళ్లు కూడా ప్రింట్ రూపంలో ఉండటంతో మాస్క్ పెట్టుకుంటే ఏమీ కనిపించదు. దాంతో కాసేపు సరదాగా వాడుకోవచ్చని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. అసలింతకీ ఈ వినూత్న ఆలోచనని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నా, అక్కడి ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?