ఆటలో గెలవలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు
జపాన్ ప్రజలు గేమ్స్ ప్రియులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గేమ్స్ ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్తోపాటు ప్రత్యేకంగా ఆర్కేడ్ గేమ్స్ సెంటర్లు దేశవ్యాప్తంగా దర్శనమిస్తుంటాయి. కొన్ని గేమ్స్ తెలివితో ఆడాల్సి ఉంటుంది. మరికొన్ని గేమ్స్కు నైపుణ్యం అవసరం. ఇటీవల
(ఫొటో: ఒగాటన్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రజలు గేమ్స్ ప్రియులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గేమ్స్ ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్తోపాటు ప్రత్యేకంగా ఆర్కేడ్ గేమ్స్ సెంటర్లు దేశవ్యాప్తంగా దర్శనమిస్తుంటాయి. కొన్ని గేమ్స్ తెలివితో ఆడాల్సి ఉంటుంది. మరికొన్ని గేమ్స్కు నైపుణ్యం అవసరం. ఇటీవల జపాన్కి చెందిన ఓ యువకుడు గేమ్స్ సెంటర్కి వెళ్లి ఒక ఆట ఆడాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు గేమ్స్ సెంటర్ యాజమాన్యం దిగొచ్చి సులువుగా గెలుపొందే విధంగా ఆటను మార్చడం విశేషం.
ఒగాటన్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు ఇటీవల టోక్యోలోని ఓ ఆర్కేడ్ గేమ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడున్న క్రేన్ గేమ్ (అద్దంలోపల ఉండే వస్తువుల్ని క్రేన్ సాయంతో బయటకు తీసుకురాగలిగితే ఆ వస్తువును గెలుచుకున్నట్లు) ఆడాడు. 200 సార్లు ప్రయత్నించినా అతడికి ఒక్క వస్తువు కూడా దక్కలేదు. దీంతో ఆగ్రహించిన ఒగాటన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆటలో అక్రమం జరుగుతోందని, ఎవరూ విజేతలుగా నిలవలేకపోతున్నారని ఆరోపించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. గేమ్స్ సెంటర్ సిబ్బంది కూడా ఆ ఆటను ఆడి చూపించారు. వాళ్లు కూడా 300 సార్లు ప్రయత్నించినా గెలవలేకపోయారు. దీంతో సమస్య ఎక్కడుందో యాజమాన్యం గుర్తించింది. అద్దంలోపల వస్తువులు పెట్టిన స్థానాలు సరిగా లేవని తెలుసుకొని మార్పులు చేశారు. దీంతో ఒగాటన్ సులువుగా ఆట గెలిచి వస్తువును దక్కించుకున్నాడు. ఇదంతా దగ్గరుండి పర్యవేక్షించిన పోలీసులు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ఆ గేమ్ సెంటర్ యాజమాన్యం మాత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అన్ని క్రేన్ గేమ్స్ కస్టమర్ల నైపుణ్యం, అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం సరాదా కోసమే. డబ్బులు పెట్టినంత మాత్రాన కచ్చితంగా బహుమతి రావాలని లేదు. ఈ పరిస్థితి అర్థం చేసుకొని గేమ్స్ ఆడాలని కోరుతున్నాం’’అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఒగాటన్ తన ట్విటర్లో పెట్టడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!