JEE Main Result: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. 2021కు సంబంధించిన జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
దిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. 2021కు సంబంధించి జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 7 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను ఎన్టీఏ తన వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే, విద్యార్థులు తమ ఫలితాలు చూసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వెబ్సైట్ క్లాష్ అవ్వడంతో ఎర్రర్ వస్తున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.