Karnataka: ఆ గిత్త ధర రూ.కోటి పైమాటే..!
ప్రణాళిక, వ్యాపార మెళకువలు పాటిస్తే వ్యవసాయంలో కోట్ల రూపాయలు సంపాదించొచ్చని కర్ణాటక రైతులు నిరూపిస్తున్నారు.
బెంగళూరు: ప్రణాళిక, వ్యాపార మెళకువలు పాటిస్తే వ్యవసాయంలో కోట్ల రూపాయలు సంపాదించొచ్చని కర్ణాటక రైతులు నిరూపిస్తున్నారు. ఆధునిక వ్యవసాయంవైపు దృష్టి సారించిన అన్నదాతలు దేశవాళీ పశువులను మార్కెట్ రారాజులుగా మారుస్తున్నారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. తమ ఆవిష్కరణలతో రైతులను స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తున్నారు.
బెంగళూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం యూఏఎస్, జీకేవీకేలో వ్యవసాయ మేళా నిర్వహిస్తున్నారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను రైతులు ప్రదర్శిస్తున్నారు. మెళకువలు పాటిస్తే వ్యవసాయంలోనూ లాభాలు గడించవచ్చని కర్ణాటక రైతులు చెబుతున్నారు. సాధారణంగా మేలుజాతి గిత్తలు రూ.1-2 లక్షల ధర పలుకుతాయి. అయితే కర్ణాటకలోని మాళవల్లి నుంచి జీకేవీకే మేళాకు తెచ్చిన హళ్లికార్ జాతి గిత్త ఏకంగా రూ.కోటి ధర పలుకుతోందని.. ఆ గిత్త యజమాని బోరే గౌడ చెబుతున్నారు. అంతరించిపోత్తున్న హళ్లికార్ జాతి సంరక్షణకు ఆయన ముందుకొచ్చారు. ఈ జాతి ఆవు పాలలో.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏ2 ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని పేర్కొన్నారు. హళ్లికార్ జాతికి చెందిన ఈ గిత్త వీర్యం ఒక డోసు ధర రూ.1000 పైనే ఉంటుంది. మూడేళ్ల వయసు నిండిన గిత్త నుంచి ప్రతి వారం వీర్యాన్ని సేకరించి నైట్రోజన్ కంటెయినర్లలో భద్రపరుస్తారు. కొన్ని వందల ఏళ్ల వరకు ఈ వీర్యాన్ని భద్రపరచవచ్చని జీకేవీకే పశు విజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. దేశంలో తొలిసారిగా ప్రైవేటు సంస్థల సహకారంతో వీర్యాన్ని సేకరించి భద్రపరచడం.. హళ్లికార్ జాతి పశువులతోనే ప్రారంభమైనట్టు ఇక్కడి రైతులుపేర్కొంటున్నారు. సరైన పోషకాహారం అందిస్తే ఈ జాతి పశువులు 20 ఏళ్లపాటు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రైతులు సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సైతం ఈ జాతి పశువులపై ఆసక్తి చూపుతున్నాయి. వ్యవసాయం కంటే సంతానోత్పత్తి కోసమే ఈ జాతులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాము వృద్ధి చేసిన హళ్లికార్ గిత్తలను కృష్ణ, ఏకలవ్య లాంటి పేర్లతో రైతులు పిలుస్తుంటారు. ఇదే మేళాలో ప్రదర్శిస్తున్న పలు జాతుల గొర్రెలు రూ.5-10 లక్షల వరకు ధర పలుకుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా జాతి డార్ఫర్ రూ.10 లక్షలు పలుకుతోందని చెప్పారు. పర్షియన్, డాస్కట్హాన్ జాతుల నుంచి ఈ గొర్రెను వృద్ధి చేశారు. తల భాగం నల్లగా.. శరీరం తెల్లగా ఉండే డార్ఫర్ సుమారు 120 కిలోల బరువు ఉంటుంది. శించన, బండూరి రకానికి చెందిన గొర్రెలు గరిష్ఠంగా రూ.7 లక్షల ధర పలుకుతున్నాయి. జీవాలతోపాటు.. వ్యవసాయ రంగంలోనూ రైతులు వినూత్న ఆవిష్కరణలు చేశారు. పేడతో అలంకృతులు, పూజా సామగ్రి, డ్రోన్లు, విత్తనం నుంచి కోత దశ వరకు.. అన్ని ప్రక్రియలు చేసే పవర్ వీడర్ లాంటివి ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం