Finger Pain: టైపింగ్తో వేళ్లు నొప్పెడుతున్నాయా..? ఉపశమనం పొందండిలా!
ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల చేతివేళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పిపెడుతుంటాయి. మరీ ఈ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్డెస్క్: లాక్డౌన్తో గత రెండేళ్లుగా ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్, మొబైల్, ల్యాప్టాప్ లేనిదే పని సాగని పరిస్థితి. అయితే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని మొబైల్, ల్యాప్టాప్లలో టైప్ చేస్తుండటంతో చేతులు, భుజాలు, వెన్నెముక వంటి శరీరభాగాలపై ఒత్తిడి పెరగడంతోపాటు కంటి సమస్యలు కూడా తలెత్తున్నాయట. మరీ ముఖ్యంగా చేతి వేళ్లు ఎక్కువగా నొప్పిపెడుతున్నట్లు పలువురు తెలిపారు. అయితే చేతి వేళ్లపై ఒత్తిడి తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకుందాం.
💻 పనిలో పడిపోతే కొంతమంది సమయం గురించి పట్టించుకోరు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుండిపోయి పనిచేస్తుంటారు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కనీసం ప్రతి గంటకోసారి చిన్న బ్రేక్ తీసుకోమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
💻 బ్రేక్ సమయంలో చేతి వేళ్లని చాచుతూ ఉండాలి. అలానే పిడికిలి మూస్తూ, తెరుస్తూ కొద్ది సెకన్లు చేయడం వల్ల చేతి వేళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
💻 మనం కూర్చుకునే పద్ధతి వల్ల కూడా చేతి వేళ్లపై ప్రభావం ఉంటుందట. టైప్ చేయడానికి ఇబ్బందికరంగా లేనిచోటులో మనం ఉపయోగించే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ను ఉంచడంతోపాటు, అందుకు అనువైన టేబుల్, కుర్చీని ఎంచుకోమని సూచిస్తున్నారు.
💻 కొన్నిసార్లు మంచంపై కూర్చుని లేదా పడుకుని పనిచేస్తుంటాం. దానివల్ల చేతులపై ఒత్తిడి పెరిగి వేళ్లు నొప్పి పెడుతుంటాయి. అందుకే చేతివేళ్లపై భారం పడకుండా ఉండాలంటే మనం సరైన పద్ధతిలో కూర్చుని పనిచేయడం ఎంతో ముఖ్యం. వీటితోపాటు చేతి వేళ్లపై మెల్లగా మసాజ్ చేయడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్