AP News: శ్రీశైలంలో డ్రోన్ల సంచారం!

జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు....

Updated : 04 Jul 2021 17:59 IST

శ్రీశైలం: జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో  అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది.. వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట ప్రయత్నాలు చేశారు. అసలవి డ్రోన్లా? కాదా? అని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని