ఊపిరితిత్తులు కోలుకుంటున్నాయి!
కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి.
వాటంతట అవే సాధారణ స్థితికి..
దిల్లీ: కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఒకసారి వైరస్ సోకి.. ఆ తర్వాత నెగిటివ్గా నిర్ధారణ అయినా కూడా అవి పూర్తిగా కోలుకున్న ఛాయలు కనిపించడం లేదని తెలుస్తోంది. కొవిడ్ తరవాత ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై ఆస్ట్రియా పరిశోధకులు చేసిన అధ్యయనం సానుకూల సంకేతాలను ఇచ్చింది.
దాని ప్రకారం..కరోనా వైరస్ సోకి తీవ్రంగా ప్రభావితమైన 82 మంది వ్యక్తులు కోలుకున్న 6, 12, 24 వారాల తరవాత వారి కార్డియో-పల్మనరీకి జరిగిన నష్టంపై పరిశోధన జరిపారు. ఆరు వారాలు, 12 వారాల తరవాత ఆ కోలుకున్నవారి సిటీ స్కాన్ను పరిశీలించగా..ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వస్తున్నట్లు గుర్తించారు. వైరస్ నుంచి బయటపడిన వారాల తరవాత ఊపిరితిత్తులు వాటంతట అవే మామూలు స్థితికి వచ్చే సామర్థ్యాన్ని చూపించినట్లు వెల్లడవుతోందన్నారు. వాటికి సంబంధించి సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటే ఈ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు దోహదం చేస్తుందని, ఊపిరితిత్తుల సామర్థ్యం, కండరాల బలం, ఆందోళన తగ్గటం వంటి విషయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని వెల్లడించారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా ఊపిరితిత్తులకు నష్టం జరుగుతున్నందు వల్ల తాజా నిరూపణ అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుందని తెలిపారు. అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేశారు.
ఈ అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా మీడియాతో మాట్లాడారు. లక్షణాలు కనిపించని వ్యక్తుల్లో కూడా 20 నుంచి 30 శాతం కేసుల్లో ఊపిరితిత్తుల్లో మచ్చలు కనిపించాయన్నారు. కొన్ని కేసుల్లో మినహా శరీరానికి ఉన్న సహజమైన రోగ నిరోధకశక్తి కారణంగా వాటంతట అవే కోలుకుంటున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్