వైకల్యాన్ని జయించి.. పారాలింపిక్స్కు సన్నద్ధం
హిమాలయాలకు సైకిల్పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు.
తిరువనంతపురం: హిమాలయాలకు సైకిల్పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు. అతడి గుండె నిబ్బరానికి దాసోహమైన సైకిల్ పెడల్ ఒంటి కాలు కింద ఒరిగిపోయి కొండలు, లోయల్లో చక్కర్లు కొట్టిస్తోంది. ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలిచిన ఆ కేరళ యువకుడి కథేంటో ఓసారి తెలుసుకుందాం.
20ఏళ్ల వయసు, 14 శస్త్ర చికిత్సలు, రోజుకు 30మాత్రలు, అంతంత మాత్రం పని చేసే కిడ్నీలు. కానీ అవేవీ అతడిని నిరుత్సాహ పర్చలేదు. పారాలింపిక్స్లో సత్తాచాటేందుకు ఒంటి కాలితో సిద్ధమవుతున్నాడు కేరళ కుర్రాడు శ్యామ్కుమార్. తిరువనంతపురం బేయాడ్కు చెందిన శ్యామ్కుమార్ 3 కిడ్నీలతో జన్మించాడు. జన్యు లోపం వల్ల అతడి కుడికాలు వెనక భాగంలో కలిసిపోయింది. 8ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ కాలును వేరు చేయాల్సి వచ్చింది. అప్పటికే శ్యామ్ మూత్రపిండాలు పాక్షికంగా పని చేస్తున్నాయి. వీటికి తోడు పేదరికం. అయితే ఇవేవీ అతడిని ప్రభావితం చేయలేకపోయాయి. జీవితంలో ముందుకు సాగాలన్న శ్యామ్ సంకల్ప బలం ముందు జన్యులోపాలు ఓడిపోయాయి. అతడు తన శరీర ఆకృతికి సరిపోయేలా కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీ చదువుతున్న శ్యామ్ ఆ కాలు సాయంతోనే కళాశాలకు సైకిల్పై వెళ్లేవాడు. రోజూ సమీపంలో ఉన్న కొండలు, లోయల్లో సుమారు 20కిలోమీటర్ల మేర చక్కర్లు కొడుతూ ఉండేవాడు. కృత్రిమ కాలు మరమ్మతులకు గురైన సమయంలో ఒంటికాలుతోనే సైకిల్ తొక్కేవాడు. నిరంతర సాధనతో సైక్లింగ్పై పట్టు సాధించాడు శ్యామ్. ఆ అనుభవంతోనే పారాలింపిక్స్లో దేశం తరఫున సత్తా చాటాలనుకుంటున్నాడు. ఎప్పటికైనా ప్రజాదరణ పొందే సైక్లింగ్ స్టార్ కావాలన్నదే తన ఆశయమని చెబుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ