నిర్లక్ష్యంపై యువకుడి ఆవేదన.. 24 గంటల్లోపే..
కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తనను వెంటనే డిస్ఛార్జి చేయాలని వేడుకున్న ఓ యువకుడు 24 గంటలు తిరిగేలోపే మృత్యువాత పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువకుడు జ్వరంతో గతవారం స్థానిక ఆక్స్ఫర్డ్ ఆసుపత్రిలో చేరాడు....
బెంగళూరు: కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తనను వెంటనే డిశ్ఛార్జి చేయాలని వేడుకున్న ఓ యువకుడు 24 గంటలు తిరిగేలోపే మృత్యువాత పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువకుడు జ్వరంతో గతవారం స్థానిక ఆక్స్ఫర్డ్ ఆసుపత్రిలో చేరాడు. అయితే, సిబ్బంది పట్టించుకోవడం లేదని, తనను వెంటనే ఇక్కడి నుంచి డిశ్ఛార్జి చేయాలంటూ సదరు యువకుడు ఓ వీడియో ద్వారా వేడుకున్నాడు. కాగా ఈక్రమంలోనే శనివారం నాటికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో అతడు మృత్యువాతపడ్డాడు.
కొడుకు క్షేమంగా తిరిగివస్తాడని ఆసుపత్రి బయటే ఎదురుచూస్తున్న తల్లి ఈ విషయం తెలుసుకొని తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతిచెందాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!