శునకం కడుపులో మాస్కు.. బయటకు తీసిన వైద్యులు
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడం ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. భారత్లో రోజురోజుకీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
చెన్నై: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడం ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. భారత్లో రోజురోజుకీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు మాస్కులు ధరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ వాటిని వాడి ఎక్కడబడితే అక్కడ పడేయడం మూగజీవాల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. ఇటీవల చెన్నైలో ఓ పెంపుడు శునకానికి తలెత్తిన ఇబ్బందితో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది.
తమిళనాడుకు చెందిన కొందరు వెటర్నరీ వైద్యులు సైబీరియన్ జాతికి చెందిన ఓ పెంపుడు శునకం కడుపులోంచి మాస్కును వెలికి తీస్తున్న వీడియో ఇటీవల బయటికొచ్చింది. ఆ వీడియోను సుప్రియ సాహు అనే ఐఏఎస్ అధికారి ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘మనం నిర్లక్ష్యంగా విసిరి పారేస్తున్న మాస్కులు మూగజీవాలకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉంది. చెన్నైలోని వెటర్నరీ, పశు వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య బృందం సైబీరియన్ హస్కీ కడుపులోంచి మాస్కును విజయవంతంగా బయటికి తీసింది. దయచేసి ఇప్పటినుంచైనా వ్యర్థాలను నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు’’ అని ట్వీట్ చేశారు. చాలామంది నెటిజన్లను ఈ వీడియో కలవరపాటుకు గురిచేసింది. ఇక నుంచి వినియోగించిన మాస్కులను బయట పడేసేటప్పుడు జాగ్రత్త వహించాలంటూ సూచించారు. శునకాన్ని కాపాడిన వైద్యులకు ట్విటర్ వేదికగా పలువురు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం