శునకం కడుపులో మాస్కు.. బయటకు తీసిన వైద్యులు

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడం ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. భారత్‌లో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో

Published : 14 Jun 2021 01:40 IST

చెన్నై: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా మాస్కులు, పీపీఈ కిట్లు ధరించడం ఈ రోజుల్లో సాధారణం అయిపోయింది. భారత్‌లో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు మాస్కులు ధరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ వాటిని వాడి ఎక్కడబడితే అక్కడ పడేయడం మూగజీవాల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. ఇటీవల చెన్నైలో ఓ పెంపుడు శునకానికి తలెత్తిన ఇబ్బందితో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. 

తమిళనాడుకు చెందిన కొందరు వెటర్నరీ వైద్యులు సైబీరియన్‌ జాతికి చెందిన ఓ పెంపుడు శునకం కడుపులోంచి మాస్కును వెలికి తీస్తున్న వీడియో ఇటీవల బయటికొచ్చింది. ఆ వీడియోను సుప్రియ సాహు అనే ఐఏఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘మనం నిర్లక్ష్యంగా విసిరి పారేస్తున్న మాస్కులు మూగజీవాలకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉంది. చెన్నైలోని వెటర్నరీ, పశు వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య బృందం సైబీరియన్‌ హస్కీ కడుపులోంచి మాస్కును విజయవంతంగా బయటికి తీసింది. దయచేసి ఇప్పటినుంచైనా వ్యర్థాలను నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు’’ అని ట్వీట్‌ చేశారు. చాలామంది నెటిజన్లను ఈ వీడియో కలవరపాటుకు గురిచేసింది. ఇక నుంచి వినియోగించిన మాస్కులను బయట పడేసేటప్పుడు జాగ్రత్త వహించాలంటూ సూచించారు. శునకాన్ని కాపాడిన వైద్యులకు ట్విటర్‌ వేదికగా పలువురు అభినందనలు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు