అంగారకుడిపై హెలికాప్టర్.. ఎగిరేందుకు సిద్ధం!
అంగారకుడి ఉపరితలంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రవేశ పెట్టిన ఇన్జెన్యూటీ హెలికాప్టర్ ఎగరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే హెలికాప్టర్ రోటార్లను విజయవంతంగా పరీక్షించినట్లు నాసా శుక్రవారం వెల్లడించింది.
వాషింగ్టన్: అంగారకుడి ఉపరితలంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రవేశ పెట్టిన ఇన్జెన్యూటీ హెలికాప్టర్ ఎగరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే హెలికాప్టర్ రోటార్లను విజయవంతంగా పరీక్షించినట్లు నాసా శుక్రవారం వెల్లడించింది. ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను రోవర్ కెమెరాల సాయంతో చిత్రీకరించి.. ట్విటర్లో విడుదల చేసింది. ఆదివారం నాడు హెలికాప్టర్ పైకి ఎగరనున్నట్లు నాసా వెల్లడించింది.
‘హెలికాప్టర్ చురుగ్గానే పనిచేస్తోంది. దాని రోటార్ల పనితీరుపై మేం పరీక్షించాం. 50ఆర్పీఎం వేగంతో జాగ్రత్తగా రోటార్లను పరీక్షించాం’ అని హెలికాప్టర్ ఆపరేషన్స్ లీడర్ టిమ్ కన్హమ్ తెలిపారు. ‘భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ.. అందుకే ల్యాండింగ్తో పాటు, పైకెగరడం కూడా కాస్త కష్టతరమైన విషయం. హెలికాప్టర్ ఆపరేషన్ కూడా కాస్త రిస్క్తో కూడుకున్న పని. కానీ ఈ ప్రక్రియ ద్వారా అంగారక గ్రహంపై ఉండే పరిస్థితుల గురించి అమూల్యమైన డేటా పొందవచ్చు’ అని ప్రాజెక్ట్ మేనేజర్ ఆంగ్ వెల్లడించారు. హెలికాప్టర్ నిలువుగా పైకి ఎగిరి తిరుగుతూ పర్సెవరెన్స్ రోవర్ ఫొటోలు తీస్తుందని నాసా వెల్లడించింది.
అంగారకుడిపై జీవం పుట్టుకకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2020లో రోవర్ను పంపిన విషయం తెలిసిందే. అది ఫిబ్రవరి 18న అంగారకుడిపై ల్యాండ్ అయింది. ఆ రోవర్ నుంచి ఇన్జెన్యూటీ హెలికాప్టర్ను నాసా ఇటీవల అంగారకుడి ఉపరితలంపైకి దింపింది. ఎలాంటి సాంకేతిక సాయం లేకుండానే హెలికాప్టర్ అక్కడి వాతావరణానికి తట్టుకోగలుగుతోందని నాసా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు