ఎన్ఐఏ సోదాలు.. కీలక ఆధారాలు లభ్యం
తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. తెలంగాణలోని
తనిఖీలపై వివరాలు వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో 40 సెల్ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్డిస్క్లు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్డ్రైవ్లు, ఆడియో రికార్డర్స్, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్ నోట్లతో పాటు రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వివరించారు.
తెలంగాణలోని పలువురు పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు ఎన్ఐఏ సోదాలు నిర్వహించడంతో పాటు వారిని ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఈ నలుగురికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టులో కేసులున్నందున ఈ నెల 3న తేదీన హాజరవుతానని న్యాయవాది రఘునాథ్ ఎన్ఐఏ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో అందుకు అంగీకరించారు. అయితే ఎన్ఐఏ సోదాలను ప్రజసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేస్తున్నారని పలువురు నేతలు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు