Ts news: కేసీఆర్‌ను కలిసేందుకు యత్నించిన వృద్ధురాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

కరీంనగర్‌ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.....

Published : 28 Aug 2021 02:14 IST

తీగలగుట్టపల్లి: కరీంనగర్‌ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కరీంనగర్‌ పర్యటనలో ఉన్న సీఎం తీగల గుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌లో బస చేశారు. అయితే నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మేకల లచ్చవ్వ అనే దళిత వృద్ధురాలు తనకు న్యాయం చేయాలని సీఎంను కలిసేందుకు తెలంగాణ భవన్‌కు వెళ్లారు. పూర్తి వికలాంగురాలైన లచ్చవ్వ కేసీఆర్‌ను కలవాలని పోలీసులను ప్రాధేయపడింది. అక్కడే ఉన్న జగిత్యాల డీఎస్‌పీ ప్రకాష్ భద్రతా సమస్య వస్తుందన్న కారణంతో ఆమెకు రూ.100 ఇచ్చి ఆటోలో ఇంటికి వెళ్లాలని చెప్పారు. కొద్ది దూరం వెళ్లి పక్కన కూర్చున్న లచ్చవ్వ ఎలాగైనా కేసీఆర్‌ను కలవాలని.. కలెక్టర్ కార్యాలయం వెళ్లే క్రమంలో ఆయన కారు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలనుకుంది. ఇది గ్రహించిన పోలీసులు ముందస్తుగా ఆమెను పోలీసు వాహనంలో ఎక్కించి ఇంటికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని