Ts News: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్-దిల్లీ-చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. అయితే విమాన సర్వీసు రద్దుపై...
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్-దిల్లీ-చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. అయితే విమాన సర్వీసు రద్దుపై ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమచారం లేదని.. ఆకస్మికంగా రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే విమానాలు రద్దు కాలేదని.. అంతా బాగుందని చెప్తున్నారని ప్రయాణికులు వాపోయారు. కాని ఎయిర్పోర్టులో మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.