పెళ్లైన 58ఏళ్లకు ఫొటోషూట్‌!

నేటి తరంలో ఫొటోకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ కేరళలో ఓ వృద్ధ జంటకు వివాహమై 58ఏళ్లు దాటినా ఇంతవరకూ ఇద్దరూ కలిసి ఒక్క ఫొటో కూడా దిగలేదట.

Published : 06 Oct 2020 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేటి తరంలో ఫొటోకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ కేరళలో ఓ జంటకు వివాహమై 58 ఏళ్లు దాటినా ఇంతవరకూ ఇద్దరూ కలిసి ఒక్క ఫొటో కూడా దిగలేదట. 1962 జనవరి 1న కుంజుట్టి, చిన్నమ్మలకు వివాహం జరిగింది. అప్పట్లో ఫొటోగ్రాఫర్‌ అందుబాటులో లేకనో మరే ఇతర కారణంతోనో పెళ్లిలో ఫొటోలు దిగలేదు. ఆ కోరికను ఇప్పుడు తమ మనవడి సాయంతో తీర్చుకొని ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బవుతున్నారు. వివాహమైన 58 ఏళ్ల తరువాత వారు చేసిన ఈ ఫొటోషూట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని