కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ!
ప్రధాని మోదీ..ఆదివారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ భేటిలో పాల్గొన్నారు.
దిల్లీ: ప్రధాని మోదీ..ఆదివారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ భేటిలో పాల్గొన్నారు. కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లాక్డౌన్ సండలింపులపై కూడా ఈ సమావేశంలో చర్చింనట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఐదుసార్లు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కరోనా సెకండ్ వేవ్తో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో మంత్రిత్వ శాఖల పనితీరుపై ఈ సమావేశాల్లో ప్రధాని సమీక్షించిన్నట్లు సమాచారం. ఆయా శాఖల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. 2019లో భాజపా అధికారం చేపట్టిన తర్వాత ఇంతవరకు కేబినెట్ విస్తరణ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె