‘ఒకట్రెండు రోజుల్లో విద్యా సంవత్సరంపై ప్రకటన’
ఆన్లైన్ తరగతులు నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇస్తూ ఆన్లైన్, దూర విద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించిందని
హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఆన్లైన్ తరగతులు నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇస్తూ ఆన్లైన్, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రకటిస్తామని వెల్లడించింది. అనంతరం కోర్టు స్పందిస్తూ ‘‘మార్చిలోనే విద్యా సంవత్సరం మొదలు పెట్టినట్టు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా?’’ అని ప్రశ్నించింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్లైన్ పాఠాలు చెబుతున్నాయని, ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్లైన్లో ఎలా ఉండగలరు? అని ప్రశ్నించింది. వీటి వల్ల పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు పాటించాల్సిన విధి విధానాలను కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోను పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలపగా.. ప్రస్తుత దశలో ఈ విషయంలో ఉత్తర్వులు ఇవ్వలేమని, విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని కోర్టు తెలిపింది. ఆన్లైన్ తరగతులపై తమ వైఖరి వెల్లడించేందుకు సీబీఎస్ఈ కొంత సమయం కోరింది. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు