TS: భారీగా ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్కుమార్లకు పదోన్నతి లభించింది. ముఖ్యకార్యదర్శులుగా దాన కిశోర్, జనార్దన్రెడ్డి, కార్యదర్శులుగా శ్వేతామహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, కె.శివకుమార్ నాయుడుకు పదోన్నతి లభించింది. కృష్ణభాస్కర్, ఇలంబర్తి, అలుగు వర్షిణి, రాజీవ్గాంధీ
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్కుమార్లకు పదోన్నతి లభించింది. ముఖ్యకార్యదర్శులుగా దాన కిశోర్, జనార్దన్రెడ్డి, కార్యదర్శులుగా శ్వేతామహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, కె.శివకుమార్ నాయుడుకు పదోన్నతి లభించింది. కృష్ణభాస్కర్, ఇలంబర్తి, అలుగు వర్షిణి, రాజీవ్గాంధీ హనుమంతు, ఆర్.వి.కర్ణన్, కొర్రా లక్ష్మి, దేవసేన, వెంకట్రామిరెడ్డి, గౌరవ్ ఉప్పల్, మాణిక్రాజ్, చంపాలాల్, సునితా భగవత్, షఫియుల్లా, ప్రియాంకా వర్గీస్లకు పదోన్నతి కల్పించింది. ఐఎఫ్ఎస్ అధికారులు వినోద్కుమార్, రామలింగం, ఆశా, ప్రదీప్కుమార్ శెట్టికి పదోన్నతి లభించింది. పూర్తిస్థాయి పీసీసీఎఫ్గా ఆర్.శోభను ప్రభుత్వం నియమించింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఐజీ నుంచి అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించింది. సజ్జనార్, అనిల్కుమార్, చారుసిన్హాలు పదోన్నతి పొందినవారిలో ఉన్నారు. ఇకపై సైబరాబాద్ కమిషనర్గా అదనపు డీజీ హోదాలో సజ్జనార్ కొనసాగనున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్గా అనిల్కుమార్ కొనసాగనున్నారు. ప్రస్తుతం చారుసిన్హా డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఐజీగా షానవాజ్ ఖాసీం, డీఐజీగా విక్రంజిత్ దుగ్గల్కు పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..