పల్స్‌ పోలియా కార్యక్రమం వాయిదా

జనవరి 17న జరగనున్న పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. తదుపరి పల్స్‌ పోలియో వాయిదా కార్యక్రమం తేదీని...

Updated : 10 Jan 2021 05:27 IST

హైదరాబాద్‌: జనవరి 17న జరగనున్న పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. తదుపరి పల్స్‌ పోలియో వాయిదా కార్యక్రమం తేదీని వెల్లడిస్తామని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు జాతీయ ఇమ్యునైజేషన్ సలహాదారు ప్రదీప్ హల్డర్ రాష్ట్రాలకు సమాచారం అందించారు. అయితే కేంద్రం కొవిడ్‌ టీకా పంపిణీని ఈ నెల 16 నుంచి చేపడుతుండడంతో.. ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి..

‘స్ట్రెయిన్‌’ నిర్ధారణ పరీక్షలపై ఎఫ్‌డీఏ హెచ్చరిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని