Sadhguru Jaggi Vasudev: దీపావళి టపాసులను బ్యాన్ చేయకండి!
దీపావళి పండుగ నాడు టపాసులను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. మరి కచ్చితంగా టపాసుల కాల్చివేతను ఆపేయాల్సిందేనా అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాస్దేవ్ సద్గురు తనదైన శైలిలో బదులిచ్చారు
ఇషా ఫౌండేషన్ స్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్
చెన్నై: దీపావళి పండుగ నాడు టపాసులను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. మరి కచ్చితంగా టపాసుల కాల్చివేతను ఆపేయాల్సిందేనా అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సద్గురు తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘ కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచే దీపావళి రోజు టపాసులు పేల్చొచ్చని కలలు కనేవాళ్లం. పండుగ అయిపోయినా సరే!.. ఆ టపాసులను దాచుకొని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయుకాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయు కాలుష్యంపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులందరికీ నేనో ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నా. అదేంటంటే..ఈసారికి మీరు కాల్చడం మానేసి మీ పిల్లల్ని కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీస్కు కారులో కాకుండా మూడురోజుల పాటు నడిచి వెళ్లండి.’’ అంటూ ఓ వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఓ నెటిజన్ ఈవిషయాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ సద్గురూ! మీరు చెప్పింది నిజం. కాలుష్యానికి కారణమైన టాప్ 10లో కూడా దీపావళిని కారణంగా పేర్కొలేదు. బహుశా కొత్తగా వచ్చిన పర్యావరణ కార్యకర్తలు ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారు’’ అంటూ కామెంట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?