సోషల్ మీడియా కట్టడిపై కేంద్రానికి నోటీసులు
సామాజిక మాధ్యమాల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి తెలపాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాల వ్యాప్తికి సోషల్ మీడియా సంస్థలను బాధ్యులను చేస్తూ వాటిపై చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు...
దిల్లీ: సామాజిక మాధ్యమాల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి వెల్లడించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాల వ్యాప్తికి సోషల్ మీడియా సంస్థలను బాధ్యులను చేస్తూ వాటిపై చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ వార్తల వ్యాప్తి వేగంగా జరుగుతోందని.. వాటి కట్టడికి కేంద్రం చట్టాలను రూపొందించాలని వినీత్ జిందాల్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అలానే అసత్య వార్తల వ్యాప్తికి సోషల్ మీడియా సంస్థలను బాధ్యులను చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్ట్ అయిన వెంటనే వాటిని గుర్తించి తక్కువ కాల వ్యవవధిలో తొలగించేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని పిటిషన్లో కోరారు. అసత్య వార్తల ప్రచారం వల్ల దేశంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఈ సందర్భంగా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత నెలలో కూడా సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేంద్రం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని మహేక్ మహేశ్వరి అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా సంస్థలతో తలెత్తే ఇబ్బందుల గురించి అప్పీలు చేసేందుకు పార్లమెంటులో చట్టం చేసే వరకూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి