గూగుల్ డూడుల్పై ‘భారత శాటిలైట్ మ్యాన్’!
ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం గూగుల్ తన సెర్చింజన్పై ప్రత్యేక సందర్భాలు, ప్రముఖుల జయంతి రోజున డూడుల్ను ఆవిష్కరించే విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత శాటిలైట్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ
దిల్లీ: ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం గూగుల్ తన సెర్చింజన్పై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక సందర్భాలు, ప్రముఖుల జయంతి రోజున వారి గౌరవార్థం డూడుల్ను ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు భారత శాటిలైట్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన.. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త ఉడుపి రామచంద్రరావుకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నేడు ఆయన 89వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ సెర్చింజన్ ప్రత్యేక డూడుల్ను ఆవిష్కరించింది. రావు చిత్రంతో కూడిన డూడుల్ను సెర్చింజన్పై పోస్ట్ చేస్తూ.. ఆయనకు ఘన నివాళి అర్పించింది.
‘భారత అంతరిక్ష పితామహుడిగా పిలిచే విక్రమ్సారాభాయితో కలిసి రావు కెరీర్ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో గొప్ప సేవలు అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. డాక్టరేట్ పూర్తి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్లి అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం(నాసా)లో పయనీర్, ఎక్స్ప్లోరర్ ప్రయోగాల్లోనూ గొప్ప సేవలు అందించారు’ అని గూగుల్ గుర్తు చేసింది.
ప్రొఫెసర్ రామచంద్రరావు కర్ణాటకలోని ఉడుపి గ్రామంలో 1932లో జన్మించారు. మొదట కాస్మిక్ కిరణాలకు సంబంధించిన భౌతిక శాస్త్రజ్ఞుడిగా కెరీర్ ప్రారంభించారు. డాక్టరేట్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లు నాసాలో సేవలందించిన ఆయన.. 1966లో స్వదేశానికి తిరిగి వచ్చి.. 1975లో భారత తొలి ఉపగ్రహ ప్రయోగానికి నేతృత్వం వహించారు. ఆయన రూపొందించిన 20 ఉపగ్రహాల్లో ‘ఆర్యభట్ట’ కూడా ఒకటి. ఆర్యభట్ట కమ్యూనికేషన్, వాతావరణ సమాచారాన్ని అందించడం ద్వారా.. గ్రామీణ భారతంలో ఎన్నో మార్పులు తెచ్చింది. కాగా, రావుకు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. తన డిగ్రీ విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేయడం విశేషం. ఈయన 2017లో మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు